మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించిన చంద్రబాబు! ఇకపై అన్ని గ్రామాలకు ర్యాంకులు..
Sat Feb 15, 2025 18:57 Politics
సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దూబగుంట గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్పంచి ప్రథమ పౌరుడు అని, పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం! ఆ కళాశాలలు యూనివర్సిటీలుగా త్వరలో..!
ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచిలదే అని చంద్రబాబు అన్నారు. ఇకపై అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇస్తామని, బాగా పనిచేసే సర్పంచిలను సత్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి నారాయణకు ఓ టార్గెట్ ఇచ్చానని, ఈ ఏడాది గాంధీ జయంతి (అక్టోబరు 2) నాటికి ఏ పట్టణంలోనూ నూటికి నూరు శాతం చెత్త కనిపించకుండా ఉండాలని మున్సిపల్ శాఖకు బాధ్యత అప్పగించానని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, చెత్తపై కూడా పన్నేశారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మరో 8 నెలల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!
జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!
తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!
పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్ఐఆర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.